- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. మూడు గంటలలోపు నామినేషన్ పేపర్లు దాఖలు చేయాల్సి ఉండగా, రోడ్ షో కారణంగా ఆయన సకాలంలో ఎలక్షన్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు. ఓపెన్ టాప్ జీపుపై భార్య సునీతా కేజ్రీవాల్, ఇద్దరు పిల్లతో కలిసి వాల్మీకి ఆలయం నుంచి కేజ్రీవాల్ రోడ్ షో ప్రారంభమైంది.
అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కేజ్రీవాల్కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రోడ్ షో నెమ్మదిగా ముందుకు సాగింది. ఫలితంగా సకాలంలో కార్యాలయానికి చేరుకోలేకపోయారు. నామినేషన్ పేర్లు దాఖలు చేయలేకపోవడంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేయనున్నట్టు చెప్పారు.
- Advertisement -