న్యూఢిల్లీ: డబ్బు సంపాదించాలని భావించే వారికి ఇదో సువర్ణావకాశమే. ప్రతినెలా కొంతమొత్తంలో డిపాజిట్ చేస్త స్థిర వడ్డీ రేటు పొందాలని భావించే వారికి పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ మంచి ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని నిర్ణీత కాలం పాటు డిపాజిట్ చేయాలని భావిస్తే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) ఖాతాను తెరవొచ్చు. పోస్టాఫీసులో అయితే ఐదేళ్ల వరకు డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
బ్యాంకు ఆర్డీ కన్నా పోస్టాఫీసుల్లో రికరింగ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. భారతీయ స్టేట్బ్యాకు (SBI), హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్లలో ఆర్డీలపై వడ్డీ రేటు వరుసగా 6.25 శాతం, 6.75 శాతంగా ఉంది. పోస్టాఫీస్లో అంతకంటే ఎక్కువగా 7.2 శాతం వడ్డీ లభిస్తుంది.
పోస్టాఫీసులలో నెలకు పది రూపాయలతో 60 నెలలపాటు ఆర్డీ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ.725.05 పొందొచ్చు. ప్రతి నెలా రూ.750 దాచుకుంటే రూ.54,000 చేతికి వస్తాయి. అదే, ప్రతి నెలా రూ.5,000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.3.6 లక్షలు వస్తాయి.
పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్లో వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి జమవుతుంది. దీంతో కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ రాబడి లభిస్తుంది. ఆర్డీ ఖాతా ప్రారంభించినప్పుడు ఎంత వడ్డీ రేటు ఉందో, చివరి వరకు అదే వడ్డీ కొనసాగుతుంది.