విచిత్రం: అర్ధరాత్రి వేళ అమ్మవారి ఆలయంలో.. మహిళ ప్రదక్షిణాలు! అసలేం జరుగుతోంది?

woman in temple2
- Advertisement -

woman in temple2

నెల్లూరు:  జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో తాళాలు వేసిన తలుపులు వేసినట్లుగా ఉండగానే, అర్ధరాత్రి వేళ ఓ మహిళ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణాలు చేస్తుందని, ఆమె గజ్జెల శబ్ధం వినిపిస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఈ తంతు జరుగుతున్నట్లు తెలియవచ్చింది.

దుర్గాష్టమి రోజు రాత్రి నుంచి ఇలా జరుగుతుందని పలువురు స్థానికంగా చెప్పుకుంటూ ఉన్నారు.  ఈ క్రమంలో ఆలయ పూజారి కృష్ణప్రసాద్‌ తనకు కూడా ఈ  శబ్ధాలు వినిపించాయని చెప్పడంతో కొంత మంది యువకులు దైర్యం చేసి తమ మొబైల్ కెమెరాల్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.  వీడియోలో పసుపురంగు వస్త్రాలు ధరించిన ఓ మహిళ  ముఖం కనిపించకుండా  అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం పలు టీవీ జర్నలిస్టులు జ్వాలాముఖి అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తుల అభిప్రాయాలను చిత్రీకరిస్తుండడంతో  అ ప్రాంతం అంతా సందడి నెలకొంది. ఓ వైపు మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నా.. మరో వైపు భక్తి మార్గంలో ఉండే పలువురు అమ్మవారే ఆ రూపంలో ప్రదక్షిణాలు చేస్తోందని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -