చెన్నై: 1980 దశకంలో ప్రేక్షకులను ఊర్రూతలూగించి దక్షిణాది చలనచిత్ర సీమలో తమదైన ప్రత్యేకత చాటిన రాధిక, సుహాసిని, ఖుష్బూ, ఊర్వశి కలిసి తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పేరు ‘ఓ అంద నాట్కళ్’.
మిరాకిల్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై తమిళంతోపాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామెడీ మూవీ. 80 శాతం చిత్రాన్ని ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు.
సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో విడుదలకు సిద్ధంగా ఉంది.
చదవండి: పవన్ కళ్యాణ్ 28వ చిత్రం.. ఒక హీరోయిన్గా మలయాళీ బ్యూటీ మానస!?
ఈ సినిమా గురించి దర్శకుడు జేమ్స్ వసంతన్ మాట్లాడుతూ.. 1980లో వచ్చిన నాలుగు హిట్ చిత్రాల్లో నటించిన రాధిక, సుహాసిని, ఖుష్బూ, ఊర్వశి పాత్రల కొనసాగింపే ఈ చిత్ర కథ అన్నారు. అంటే ఆ నాలుగు పాత్రల జీవితం ప్రస్తుతం ఎలా ఉందన్నది ఈ చిత్రంలో చూపించామన్నారు.
చిత్రంలో వైజీ మహేంద్రాన్, సి.సుందర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారని, చిత్రంలో కామెడీకి కొదవ ఉండదని, కడుపు చెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వడం ఖాయమని చెప్పుకొచ్చారు.