- Advertisement -
హైదరాబాద్: సాయితేజ్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా ‘చిత్రలహరి’ మూవీ నిర్మితమైంది. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకుడిగా వ్యవహరించారు. ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా ఆయనకి మంచి పేరుంది. ఈసారి కూడా ఆయన ఓ అందమైన ప్రేమకథనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ నెల 12వ తేదీన ఈ ‘చిత్రలహరి’ సినిమాను విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుని, క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ను సంపాదించుకుంది. ఎక్కడా ఒక్క కత్తెర కూడా పడకుండా ఈ సినిమా బయటికి రావడం విశేషం.
నివేదా పేతురాజ్ మరో కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో సునీల్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో కమెడియన్గా సునీల్ మళ్లీ బిజీ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. హీరో సాయితేజ్కి మాత్రమే కాదు, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమనే చెప్పాలి.
- Advertisement -