ఒక్క కత్తెర కూడా పడకుండానే.. ‘చిత్రలహరి’కి సెన్సార్ క్లియర్!ఈ నెల 12న విడుదల…

chitralahari sensor details
- Advertisement -

హైదరాబాద్: సాయితేజ్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా ‘చిత్రలహరి’ మూవీ నిర్మితమైంది. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకుడిగా వ్యవహరించారు. ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా ఆయనకి మంచి పేరుంది. ఈసారి కూడా ఆయన ఓ అందమైన ప్రేమకథనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ నెల 12వ తేదీన ఈ ‘చిత్రలహరి’ సినిమాను విడుదల కానుంది.  తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుని, క్లీన్ ‘యు’ సర్టిఫికేట్‌ను సంపాదించుకుంది. ఎక్కడా ఒక్క కత్తెర కూడా పడకుండా ఈ సినిమా బయటికి రావడం విశేషం.

నివేదా పేతురాజ్ మరో కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో సునీల్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో కమెడియన్‌గా సునీల్ మళ్లీ బిజీ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. హీరో సాయితేజ్‌కి మాత్రమే కాదు, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్‌కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమనే చెప్పాలి.

- Advertisement -