హైదరాబాద్: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సీ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో లేడీ విలన్గా ఓ హీరోయిన్ నటించబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి విలన్ రోల్లో బాలయ్య పక్కన నటించబోతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత సి. కళ్యాణ్ స్పందించారు.
చదవండి: మహర్షి పై హాట్ కామెంట్స్ చేసిన మెగాస్టార్ !
ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. వరలక్ష్మి ఇందులో నటించడం లేదని… విలక్షణ నటుడు జగపతిబాబు ఒక్కడే పవర్ ఫుల్ విలన్గా నటించబోతున్నట్లు తెలిపారు.
కాగా, బ్లాక్బస్టర్ `లెజెండ్` తర్వాత బాలకృష్ణ, జగపతిబాబు కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. `జైసింహా` వంటి హిట్ తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రమిది. ఇక మే 17న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుంది. అలాగే జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.