హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, మెగాబ్రదర్ నాగబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నో విషయాలపై స్పందిస్తున్నారని…. కానీ సినీ రంగం నలుగురు పెద్దల చేతిలో ఉందనే వార్తలపై మాత్రం ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
చిరంజీవి ఓ చోటా రాజన్…
సురేష్ బాబు ఫ్యామిలో, నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఈ నలుగురు, మరోవైపు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, అల్లు అరవింద్.. ఇంతకు మించిన పెద్ద మాఫియా ఎవరుంటారని చమత్కరించారు. తామే పెద్ద మాఫియా అని, తన అన్నయ్య చిరంజీవి ఓ చోటా రాజన్ అని, అల్లు అరవింద్ ఓ దావూద్ ఇబ్రహీం అని చెప్పారు.
ఈ నలుగురి చేతుల్లోనే పరిశ్రమ ఉన్నట్టయితే, వారికి కూడా ఫ్లాప్ లు ఎందుకు వస్తున్నాయని నాగబాబు ప్రశ్నించారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావని, ఇలాంటి సమయంలో చిన్న సినిమాలను విడుదల చేసుకోవచ్చు కదా? అని నాగబాబు అన్నారు. బిజీ టైమ్ లోనే సినిమాను విడుదల చేయాలని అందరూ అనుకుంటారని, కానీ, ఎక్కువ డబ్బు వచ్చే సినిమానే డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటారని చెప్పారు.
చదవండి: సైరా పై ఆసక్తిని పెంచుతున్న జగ్గూభాయ్ లుక్! వీరారెడ్డిగా జగపతిబాబు అదుర్స్!