హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, అలాగే ఆయనలోని టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో చరణ్తో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు ఎన్టీఆర్.
ఇప్పటివరకూ తారక్ కేవలం తన సినిమాలు, యాడ్స్లో నటించడం తప్ప బిజినెస్ వైపు దృష్టి పెట్టలేదు. ఇక ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టంగా ఉన్న తరుణంలో ఆదాయాన్ని పెంచుకోవాలని.. ఇటీవల కొంత మంది హీరోల దగ్గర్నుండీ ఐడియాలను తీసుకున్నాడట.
అమరావతిలో ప్రారంభం…
దీంతో లైఫ్ లాంగ్ ఉండే బిజినెస్ బెటర్ అనే ఉద్దేశంతో మల్టిప్లెక్స్లను మొదలెట్టడానికి తారక్ సిద్దమయ్యాడట. ఇటీవల మహేష్ ‘ఏషియన్ సినిమాస్’ తో కలిసి ఏఎంబీ సినిమాస్ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే తరహాలో తారక్ కూడా ‘ఏషియన్ సినిమాస్’తో కలిసి ఆంధ్రప్రదేశ్లో మల్టిప్లెక్స్లను నిర్మించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట.
ఈ నేపథ్యంలో ముందుగా అమరావతి లేక విశాఖపట్నంలో ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ను మొదలుపెట్టబోతున్నాడట. ప్రస్తుతం గవర్నమెంట్ అప్రూవల్ కోసం ఎదురుచూస్తున్నాడట. ఇక ఒక్కసారి అప్రూవల్ వచ్చేస్తే పనులు మొదలుపెట్టాలని తారక్ అండ్ టీం రెడీగా ఉన్నారట. ఎన్టీఆర్ కనుక బిజినెస్లో అడుగుపెడితే టాలీవుడ్ మరోసారి ‘బిజినెస్ మెన్’ అయినట్టే.