మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిన రష్మిక!

Rashmika-Mandanna, newsxpress.online
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరియర్ లోనే మైల్ స్టోన్ అయిన 25 వ సినిమాని చేస్తున్నాడు. ఒక వైపున మహేశ్ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ విడుదలకి సిద్దమవుతుంది.

అలాగే మరో వైపున ఆయన 26వ సినిమాకి అంతే వేగంగా సన్నాహాలు జరిగిపోతున్నాయి. మహేశ్ తదుపరి సినిమా అనిల్ రావిపూడితో ఉందనే సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన పనులతోనే అనిల్ రావిపూడి ప్రస్తుతం బిజీగా వున్నాడు.

మరో నాయకిగా సాయి పల్లవి..

ఒక వైపున స్క్రిప్ట్ కి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూనే, మరో వైపున మిగతా నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక కథానాయికగా సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో ఉన్నారనే టాక్ వచ్చింది. తాజాగా రష్మిక మందన పేరు తెరపైకి వచ్చింది.

అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో సాయిపల్లవికి మంచి ఆదరణ వుంది. ఇక యూత్ లో రష్మికకి విపరీతమైన క్రేజ్ వుంది. ఈ రెండు వర్గాలను థియేటర్లకు రప్పించడం కోసం అనిల్ రావిపూడి ఈ ఇద్దరినీ సెట్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే మహేష్ మహర్షి ఏప్రిల్ 25 నుండి మే 9 కి పోస్ట్ ఫోన్ అయినట్టు సమాచారం.

చదవండి:

- Advertisement -