హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం మహర్షి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని అత్యధిక కలెక్షన్లు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సందర్భంలో తాజాగా సినిమా చూసిన భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహర్షి చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు.
కుటుంబ సభ్యులతో కలిసి మహర్షి చిత్రాన్ని వీక్షించిన ఆయన చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారాయన.
మహర్షి’ చిత్రంపై వెంకయ్య నాయుడు స్పందన.. ‘కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా.
గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను.
కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా @directorvamshi @urstrulyMahesh #Maharshi pic.twitter.com/PLG1lFCllY
— Vice President of India (@VPSecretariat) May 14, 2019