హైదరాబాద్ పాతబస్తీలో దారుణం: బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్, షాకింగ్ విషయం ఏమిటంటే…

girl-gang-rape-in-hyd-old-city-1
- Advertisement -

హైదరాబాద్: కామాంధుల అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఓ మైనర్ బాలికపై 11 మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాదు, ఆ అఘాయిత్యాన్ని వీడియో ఆ తరువాత కూడా ఆ బాలికను బెదిరించి 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూ ఆమెకు నరకం చూపించారు. ఆ బాలిక కటుంబ సభ్యుల ఫిర్యాదుతో తాజాగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే… నగరంలోని కామాటిపురా పోలీస్ ‌స్టేషన్ పరిధిలోని గొల్లాకిడికి చెందిన మైనర్ బాలిక(16)పై 11 మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తరువాత ఒకరు అత్యాచారం జరపుతూ దానిని వీడియో తీసి ఆ బాలికకు చూపించారు. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోని ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తూ ఆ తరువాత కూడా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

రిపోర్టు చూసి నిర్ఘాంతపోయిన వైద్యులు…

ఈ కామాంధుల చేష్టలతో విసిగిపోయిన ఆ బాలిక తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని తన కుటుంసభ్యులకు చెప్పింది. దీంతో గత నెల 24న వారు కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగినదంతా వివరించారు. పోలీసులు ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. రిపోర్టు చూసి వైద్యులే షాక్ తిన్నారు. సదరు బాలికపై 4 ఏళ్లుగా అత్యాచారం జరుగుతోందని వారు తేల్చడంతో అందరూ నిర్ఘాంతపోయారు.

ఈ నేపథ్యంలో ఆదివారం దాదాపు 200 మంది బస్తీవాసులు కామాటిపురా పోలీస్ ‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఇన్నేళ్లుగా ఆ బాలికకు నరకం చూపించిన కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ కేసులో నిందితులకు.. పోలీసులు సహకరిస్తున్నారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

చదవండి: వీడు మనిషేనా?: ‘‘ఫోన్ చేస్తే మాట్లాడాలి.. పిలిచినప్పుడల్లా వచ్చి నా కోరిక తీర్చాలి.. లేదంటే..’’

చదవండి: దారుణం: కూతురిపై తండ్రి, బాబాయ్‌లే.. మూడేళ్లుగా అదే తంతు.. తెలిసినా మిన్నకుండిపోయిన తల్లి!

చదవండి: దారుణం: ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే.. మరో ఐదుగురితో కలిసి రెండ్రోజులపాటు…

- Advertisement -