- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో శనివారం కొత్తగా రికార్డుస్థాయిలో 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా గత 24 గంటల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. కృష్ణా, కర్నూలు జిల్లాలో ఇద్దరు చొప్పున, గుంటూరు జిల్లాలో ఒకరు మృతిచెందారు. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 101 మంది మరణించారు.
విదేశాల నుంచి వచ్చిన 18 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 89 మందితో పాటు రాష్ర్టానికి చెందిన 390 మందికి తాజాగా వైరస్ సోకింది. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో ఇప్పటివరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,452కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,240. కరోనా నుంచి కోలుకుని 411 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- Advertisement -