అమరావతి: ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి పాలన పరమైన వ్యవహారల్లో బిజీగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి….తన మంత్రివర్గ ఏర్పాటుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్న సీఎం…మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయో చెప్పనున్నారు.
అలాగే ఏ కారణం చేత వారికి పదవి ఇస్తున్నామో కూడా ఆయన వివరించనున్నారు. ఇక మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం కూడా ఖరారైంది. రేపు ఉదయం 11.49 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది.
ఏపీ సెక్రటేరియట్ ప్రాంగణంలోనే కాబోయే మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. అయితే ఏపీ ప్రభుత్వ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి పూర్తిస్థాయిలో 25 మంది మంత్రులు ప్రభుత్వంలో కొలువుదీరుతున్నారని తెలుస్తోంది.
ఇక మంత్రి వర్గంలో రెడ్లుకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నారు. ఆ సామాజికవర్గం నుంచి 7గురుకి కేబినెట్లో చోటు దక్కనుంది. ఇక బీసీలకు 6…మిగతావి ఇతర కులాలకు కేటాయించనున్నారు.