అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ రచయిత చిన్నికృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ, ఆంధ్రా ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల ప్రచార సభల్లో పవన్ వ్యాఖ్యానిండంపై ఆయన మండిపడ్డారు.
శుక్రవారం చిన్నకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తామంతా తెలంగాణలో సంతోషంగా బతుకున్నామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఆయన సిద్ధాంతమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
త్రివిక్రమ్ రాసిన డైలాగులు చెప్పడం కాదు..
రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవద్దన్న చిన్నికృష్ణ.. రాజకీయమంటే త్రివిక్రమ్ రాసిన డైలాగులు చెప్పడం కాదని ఎద్దేవా చేశారు. అంతేగాక, కాపు సామాజిక నేతలకు టికెట్లు ఇచ్చి పవన్ డబ్బులు వసూలు చేస్తున్నారని చిన్నికృష్ణ ఆరోపించారు. కులం పేరుతో కాపుల మధ్య పవన్ చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను తిట్టే అర్హత పవన్ కళ్యాణ్కు లేదని, వారి దగ్గర రాజకీయాలు ఓనమాలు నేర్చుకోవాలని పవన్కు హితవు పలికారు చిన్నికృష్ణ. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీపై ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాధ్యులెవరని ప్రశ్నించారు.
అజ్ఢాతవాసి సినిమా తీసినప్పుడే పవన్ కళ్యాణ్ తెలివి ఏంటో తెలిసిందని ఎద్దేవా చేశారు. కాపు కులమంటే మెగాస్టార్ ఫ్యామిలీ మాత్రమే కాదన్నారు. ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని నమ్మి వెంట వచ్చిన ప్రజలు మోసపోయారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేసి ఆడుకుందామంటే కుదరదని.. జగన్ వెంట తామంతా ఉన్నాయని చిన్నికృష్ణ వ్యాఖ్యానించారు. వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు.