హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. ఫలితంగా. ఏప్రిల్ 3న అంటే ఈ రోజు హైకోర్టు న్యాయమూర్తులు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఏపీలో రిలీజ్ చెయ్యాలా వద్దా అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసిపోవాలంటే, ఏప్రిల్ 11 వరకూ ఆగాలి. అప్పటివరకూ రిలీజ్ చెయ్యకూడదని న్యాయమూర్తులు భావిస్తే మరో వారం సినిమాకి బ్రేక్ పడినట్లవుతుంది. దర్శక, నిర్మాతల కోణంలో ఆలోచిస్తే, అది ఎంతమాత్రం సమంజసం కాదు.
ఎందుకంటే, ఇప్పటికే పైరసీ కారణంగా ఇలాంటి సినిమాలు చూసేందుకు చాలా మంది ప్రజలు థియేటర్లకు రాకముందే పైరసీలో చూసేస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు సినిమాని ఎంతకాలం వాయిదా వేస్తే, అంతకాలం నిర్మాతకు నష్టం తప్పదన్నది టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి న్యాయమూర్తులు ఏ నిర్ణయం తీసుకుంటారో మరికాసేపట్లో తేలుతుంది.
కోర్టు వివాదం ఇలా ఉంటే, రాంగోపాల్ వర్మ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా సినిమాపై ఏపీలోని ఆయన అభిమానుల్లో ఉన్న ఆసక్తిని ఆలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ట్వీట్లతో విరుచుకుపడుతున్నాడు.
అంతేకాదు, తారక్తో పాటూ నిజాయితీ గల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసిన తర్వాతే ఓటు వెయ్యాలని కోరాడు.ఇలా వర్మ ఈ సినిమాపై హైప్ పెంచుతుండటంతో ప్రస్తుతానికి ఈ సినిమా కోసం ఏపీలో చాలా మంది ఎదురుచూస్తున్నారు.
ఏపీ ప్రజలు థియేటర్లలో చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఇవాళైనా ఆర్జీవీకి అనుకూలంగా తీర్పు వస్తుందా లేక… టీడీపీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు..