అసెంబ్లీ లాబీల్లో లోకేశ్ సందడి…వైసీపీ ఎమ్మెల్యేలతో కరచాలనం

Nara Lokesh Latest News, TDP Latest News, AP Assembly Updates , Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ టీడీపీ ఎమ్మెల్సీ, , మాజీ మంత్రి నారా లోకేశ్…అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. ఈరోజు ఉమ్మడి సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తున్న సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన లోకేశ్… వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కరచాలనం చేసి, ఆత్మీయంగా పలకరించడం ఆసక్తికరంగా మారింది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఆనం రాంనారాయణరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును నమస్తే అంటూ లోకేష్ పలకరించడంతో విశేషం.

కాగా, ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేశ్….గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి….వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉండటంతో గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు.

చదవండి: ముందుగా జగన్ ప్రతిపక్షాలపై విమర్శల కార్యక్రమం మొదలు పెట్టారు: టీడీపీ నేత
- Advertisement -