అమరావతి: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హిందీ చిత్రపరిశ్రమ ఓ గొప్ప యువ నటుడిని కోల్పోయిందని, సుశాంత్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని ట్వీట్టర్లో తెలిపారు. సుశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెయజేశారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్(34).. ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 1986 జనవరి 21న పట్నాలో జన్మించిన సుశాంత్ సింగ్ పలు టీవీ సీరియళ్లలో నటించారు.
ఆ తర్వాత 2013లో వచ్చిన ‘కై పో చే’ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ధోనీ బయోపిక్ ‘ఎమ్ఎస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ’లో హీరోగా నటించి బాగా పాపులర్ అయ్యారు.
ఈ చిత్రంలో సుశాంత్ నటనకు ప్రముఖుల నుంచి ప్రశంసలందాయి. ‘సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్’ తదితర సేవాసంస్థలు నిర్వహిస్తూ సమాజానికి తనవంతు సాయం చేస్తున్నారు.