అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపట్లో అమరావతికి వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి పడమటలంకలోని తన నివాసానికి వెళ్లనున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పవన్ సమీక్షా నిర్వహించనున్నారు
జనసేన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లు కనీసం 3 స్థానాలు కూడా గెలవలేకపోయింది ఆ పార్టీ. కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి… ఒక్క చోట కూడా గెలవలేకపోయారు.
ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో సమీక్షలపై దృష్టిసారిస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు, ఎందుకు ఓడిపోయిందీ రిపోర్టులు తెమ్మన్న పవన్ కళ్యాణ్, ఇవాళ్టి నుంచీ చర్చిద్దామని పిలుపిచ్చారు. సమీక్షల్లో ఓటమికి కారణాలతోపాటూ ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా చర్చించబోతున్నారు.