అచ్చెన్నాయుడికి ముగిసిన మూడో రోజు విచారణ.. రెండున్నర గంటలు ప్రశ్నించిన పోలీసులు

ex-minister-atchannaidu-arrested-by-acb-in-esi-scam
- Advertisement -

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారుల మూడో రోజు కూడా ప్రశ్నించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు రెండున్నర గంటలు ప్రశ్నించారు.

మూడు రోజుల్లో మొత్తం పదిన్నర గంటల పాటు విచారణ సాగింది. ఈఎస్ఐ టెలీహెల్త్ మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లపైనా, టెలీహెల్త్ సేవలకు సంబంధించి సిఫారసు లేఖపై అచ్చెన్న సంతకం చేయడంపైనా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.

అచ్చెన్న జవాబులతో అసంతృప్తికి గురైన అధికారులు ఆయన మనసు విప్పి జవాబు చెప్పడం లేదని భావించినట్టు తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు అచ్చెన్న బదులిస్తూ, కొనుగోళ్ల సమయానికి తాను మంత్రిగా లేనని, తెలంగాణ మాదిరి వాటి అమలుపై అధ్యయనానికి సూచించానని, మినిట్స్‌పై సంతకం చేశాను తప్పితే కొనుగోలు ఫైలు తన వద్దకు రాలేదని చెప్పినట్టు తెలుస్తోంది.

- Advertisement -