బై బై బాబు అని చెప్పాల్సిన సమయం వచ్చేసింది: ప్రశాంత్ కిశోర్

- Advertisement -

ఏపీ : ఏపీ ప్రజల నమ్మకం, విశ్వాసం కోల్పోయిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ రాజకీయ వ్యూహకర్త, జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్ విమర్శించారు.

చంద్రబాబు నాయుడు అంతలా దిగజారిపోయారని దుయ్యబట్టారు. పోలింగ్ ముగియడానికి మరికొన్ని గంటలే ఉన్నప్పటికీ తమ తీర్పు ఏమిటో ఏపీ ప్రజలు డిసైడ్ చేసేశారని వ్యాఖ్యానించారు. ‘

బైబై బాబు’ అని చెప్పాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఏపీలో 70 శాతానికి పైగా జరిగింది. చూడాలి మరి పోలింగ్ ముగిసేసరికి ఏమేర పోలింగ్ జరుగుతుందో..

https://twitter.com/PrashantKishor/status/1116282727521607680

- Advertisement -