కోడెల ‘కె’ ట్యాక్స్ వసూళ్ల బుట్ట బద్దలవుతోంది: విజయసాయిరెడ్డి

- Advertisement -

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం చేసిన అక్రమాలు వరుసగా ఒక్కొకటి బయటికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోడెల కుటుంబం లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు.

ఈరోజు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన….తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కోడెల కుమారుడు, కుమార్తె చిరు వ్యాపారులను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని, కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన కోడెల శివప్రసాదరావుపై ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇక కోడెల K ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలవుతోందని, త్వరలోనే వీరికి తగిన శిక్ష పడుతుందని అన్నారు.  కాగా, తన కుటుంబంపై కావాలనే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కోడెల మొన్న మీడియా సమావేశంలో వివరించిన విషయం తెల్సిందే. తన కుటుంబ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, విజయసాయి రెడ్డి అనసవరపు ఆరోపణలు సృష్టిస్తున్నారని అన్నారు.

చదవండి: అసెంబ్లీ లాబీల్లో లోకేశ్ సందడి…వైసీపీ ఎమ్మెల్యేలతో కరచాలనం
- Advertisement -