- Advertisement -
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారి బ్రిటన్లో విలయతాండవం చేస్తోంది.
ఈ దేశంలో శుక్రవారం ఒక్కరోజే 684మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇంగ్లండ్ లో కరోనా మృతుల సంఖ్య 3,605కు చేరింది.
ఇప్పటికే ఇక్కడ 1.7 లక్షలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవలే బ్రిటన్ యువరాజు చార్లెస్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.
అయితే చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. అదే విధంగా ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కూడా కరోనా వైరస్ సోకింది. ఆయన ఇంకా చికిత్స తీసుకుంటున్నారు.
- Advertisement -