ఢిల్లీ: ఇటీవల లోక్సభ ఎన్నికల్లో భాగంగా మోతీనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఢిల్లీ సీఎంపై కేజ్రీవాల్పై ఓ వ్యక్తి హఠాత్తుగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఓపెన్ టాప్ జీపులో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్పైకి ఒక్కసారిగా దూసుకెళ్లిన ఓ యువకుడు ఆయన చెంపపై కొట్టాడు.
ఇక వెంటనే కేజ్రీవాల్పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదిన ఆప్ కార్యకర్తలు అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.అయితే ఇది బీజేపీ-కాంగ్రెస్ పార్టీల కుట్రే అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అటు బీజేపీ, కాంగ్రెస్లు మాత్రం కేజ్రీవాల్ కావాలనే కొట్టించుకున్నారని విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల బీజేపీలో చేరి ఢిల్లీ తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కేజ్రీవాల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దృష్టి పెట్టేంత పెద్ద నాయకుడు అయితే కేజ్రీవాల్ కాదని ట్వీట్ చేశారు. మరి గంభీర్ వ్యాఖ్యలపై ఆప్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.