- Advertisement -
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ మరింత పేట్రేగిపోతోంది. రోజు రోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు దీని బారిన పడి మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 40 మంది కరోనా కాటుకు బలైనట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం మన దేశంలో కరోనా మరణాల సంఖ్య 239. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 7,447కు పెరగ్గా శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 40 మంది మరణించారు. మన దేశంలో కరోనా ప్రభావం అత్యధికంగా మహారాష్ట్రలో కనిపిస్తోంది. ఇక్కడ 1,574 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
- Advertisement -