చెన్నై: రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తూ.. పేదల కడుపు నింపుతున్న ఆ బామ్మ గుర్తుందా? తమిళనాడులోని వడివేలంపాళ్యంలో నివసిస్తున్న కె.కమలతాల్ 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది.
80 ఏళ్ల వయసులోనూ ఉదయాన్నే నిద్రలేచి, పిండి రుబ్బి ఇడ్లీల తయారీలో నిమగ్నమయ్యే ఈ బామ్మకు సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
‘‘మనలను ఆశ్చర్యానికి గురిచేసే అద్భుత గాథల్లో ఇది కూడా ఒకటి. కమలతాల్ వంటి వారికి కొంత సాయం చేసినా.. ఎంతో మందికి మంచి జరుగుతోంది. ఆ బామ్మ ఇప్పటికీ కట్టెల పొయ్యే వాడుతున్నారు. మీకు ఎవరికైనా ఆమె తెలిస్తే నాకు చెప్పండి. నేను ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెడతా. గ్యాస్ స్టవ్ కొనిస్తా’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
ఆయన ట్వీట్పై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సైతం స్పందించింది. ‘‘బాగా చెప్పారు సర్. దేశం కోసం ఇండియన్ ఆయిల్ ఏ స్ఫూర్తితో పనిచేస్తుందో దాన్ని తన సామాజిక సేవతో ఆమె మరింత ప్రతిధ్వనింప చేస్తున్నారు…’’ అని పేర్కొంది. ఆమెకు ఇండేన్ ఎల్పీజీ సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్ అందజేసిట్టు వెల్లడించింది.
One of those humbling stories that make you wonder if everything you do is even a fraction as impactful as the work of people like Kamalathal. I notice she still uses a wood-burning stove.If anyone knows her I’d be happy to ‘invest’ in her business & buy her an LPG fueled stove. pic.twitter.com/Yve21nJg47
— anand mahindra (@anandmahindra) September 10, 2019