విశాఖపట్టణం: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో వ్యభిచారం కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలోని డాబాగార్డెన్స్, సీతమ్మధార తదితర ప్రాంతాల్లోని గెస్ట్హౌస్లు, లాడ్జీలు రోజూ విటులతో కళకళలాడుతున్నాయి.
బయటి ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
స్వయంగా వన్ టౌన్ డీసీపీ లాడ్జీలు, గెస్ట్ హౌస్లలలో తనిఖీలు నిర్వహించారు. వెంకటేశ్వరమెట్ట ఆర్చి సమీపంలోని విశాఖ ఇన్, సీతమ్మధారలోని శ్రీ సాయి గెస్ట్ హౌస్, పాండురంగాపురం బీచ్ గెస్ట్ హౌస్, ఆరు ఎస్కేఎంఎల్ ఫ్లాట్లను సీజ్ చేశారు.
సీతమ్మధార ప్రాంతంలోని ఓ మసాజ్ సెంటర్లో థాయ్లాండ్ యువతులతో పురుషులకు మసాజ్ చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
విదేశాల నుంచి టూరిస్ట్ వీసాలపై యువతులను విశాఖ తీసుకొచ్చి ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న పలువురు యువతులను రెస్క్యూ హోంకు తరలించినట్టు పేర్కొన్నారు.
గెస్ట్హౌస్ లు, లాడ్జీల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.