ఒక అమ్మకి, అబ్బకి పుట్టినోడైతే.. : టీడీపీ నేత ‘చింతమనేని’ ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -

అమరావతి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై ఆయన మాట్లాడుతూ.. ‘ఒక అమ్మ,అబ్బకి పుట్టినవాడు ఎవడైనా రాజధాని అమరావతి మార్పును కోరుకోడు’అని వ్యాఖ్యానించారు. విజయవాడలో గద్దె దీక్షలో పాల్గొన్న చింతమనేని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిపై విమర్శలతో చెలరేగారు. అమరావతిని తరలించడం అనేది 29 గ్రామాల సమస్య కాదని, మొత్తం రాష్ట్ర సమస్య అని పేర్కొన్నారు. రాజధానిని మార్చడం అంటే ఏపీని అధోగతి పాలుచేయడమేనని అన్నారు.

జగన్ తన ఇంటి పేరును రివర్స్ అని పెట్టుకుంటే బాగుంటుందన్నారు. జగన్ ఓ ఉన్మాది అని, అహంకారి, దుర్మార్గుడు అనే భావన ప్రజలలో నెలకొందని చింతమేనని వ్యాఖ్యనించారు. జగన్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

- Advertisement -