దేవుడా! 26 వేల మందిని.. ప్రమాదంలో పడేసిన ఒకే ఒక్క విందు!

- Advertisement -

భోపాల్: తల్లి మృతికి సంతాపంగా ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన విందు 26 వేల మందిని క్వారంటైన్‌కు గురిచేసింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

రాష్ట్రంలోని మురేనా నగరానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో వెయిటర్. గత నెలలో అతడి తల్లి చనిపోవడంతో 17న దుబాయ్ నుంచి నగరానికి చేరుకున్నాడు.

మూడు రోజుల తర్వాత అంటే మార్చి 20న సంప్రదాయం ప్రకారం.. తల్లి మృతికి సంతాపంగా విందు ఏర్పాటు చేశాడు. ఈ విందుకు బంధుమిత్రులు అందరూ కలిసి దాదాపు 1200 మంది హాజరయ్యారు.

భార్యాభర్తలిద్దరికీ పాజిటివ్…

అనంతరం 27న అతడితోపాటు ఆ వ్యక్తి భార్య కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. అప్పుడు అధికారులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపెట్టాడు.

తాను దుబాయ్ నుంచి వచ్చినట్టు చెప్పాడు. వీరిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు ఈ నెల 2న తేలింది. విందులో పాల్గొన్న మరో 10 మందికి కూడా కరోనా వైరస్ సోకినట్టు మూడో తేదీన నిర్ధారణ అయింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు విందుకు హాజరైన, వారితో సన్నిహితంగా మెలిగిలిన దాదాపు 26,000 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరారు. 

చదవండి: కరోనా పెళ్లికి 18 మంది అతిథులు!
చదవండి: ఆదర్శం ఈ యువకులు.. 14 రోజులు చెట్లపైనే క్వారంటైన్!
చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఇంట్లో.. తల్లి రావడంతో భవనంపై నుంచి దూకేసిన బాలిక
- Advertisement -