తెలంగాణలో చెలరేగిపోతున్న కరోనా.. ఇంటర్మీడియట్ బోర్డులో 18మందికి కరోనా

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా దీని బారిన పడుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్ బోర్డులో పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి వైరస్ సోకింది. దీంతో ఇతర ఉద్యోగులకు కూడా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 18 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

 

మరి కొందరు ఉద్యోగుల ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో, మరెంత మందికి వైరస్ సోకిందోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు కార్యాలయాన్ని అధికారులు శానిటైజ్ చేయిస్తున్నారు.

- Advertisement -