జగన్‌ను కలిసి కుమారుడి వివాహానికి ఆహ్వానించిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్

- Advertisement -

అమరావతి: బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో గతేడాది నవంబరులో రిత్విక్ నిశ్చతార్థం జరిగింది. దుబాయ్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

వచ్చే నెలలో జరగనున్న తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తున్న సీఎం రమేశ్.. ప్రధాని నరేంద్రమోదీని కలిసి కుమారుడి వివాహ శుభలేఖను అందించి ఆహ్వానించారు.

తాజాగా, సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహానికి ఆహ్వానించారు. టీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసి శుభలేఖను అందించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులను ఆయన ఆహ్వానించనున్నట్లు తెలిసింది.

- Advertisement -