సంచలనం: జాయింట్ కలెక్టర్‌కు జైలుశిక్ష విధించిన హైకోర్టు జడ్జి

ap-high-court
- Advertisement -

high-court-of-apహైదరాబాద్: పగతో ఓ రిటైర్డ్ ఉద్యోగిని జైలుకు పంపిన ఓ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడికి 30 రోజుల జైలు శిక్షతోపాటు రూ. 2 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతేకాదు, సదరు రిటైర్ట్ ప్రభుత్వ ఉద్యోగిని  అక్రమంగా అరెస్టు చేసినందుకు  రూ.50 వేల పరిహారం కూడా చెల్లించాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్‌కు చెందిన బుచ్చయ్య రిటైర్ట్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన తనకు చెందిన స్థలంలో ఓ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. కానీ అది అక్రమ నిర్మాణమని కొందరు జాయింట్ కలెక్టర్ శివ కుమార్ నాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది జూలై 1న ఆ నిర్మాణంపై స్టే జాయింట్ కలెక్టర్ శివ కుమార్ నాయుడు స్టే విధించారు.

న్యాయం కోసం…

ఈ నేపథ్యంలో న్యాయం కోసం బుచ్చయ్య హైకోర్టును ఆశ్రయించారు. జాయింట్ కలెక్టర్ శివ కుమార్ నాయుడు విధించిన స్టే  ఆర్డర్‌ను కొట్టివేస్తూ 2017 ఆగష్టు 29న హైకోర్టు తీర్పు ఇచ్చింది.  దీంతో జాయింట్ కలెక్టర్ శివ కుమార్ నాయుడు.. బుచ్చయ్యపై పగ పెంచుకున్నాడు.  ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన అతడు.. బుచ్చయ్యను అరెస్ట్ చేయమంటూ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించాడు.

ఫలితంగా ఏ తప్పు చేయకున్నా బుచ్చయ్య 2 నెలల 29 రోజులపాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. చివరికి ఈ కేసులో హైకోర్టు జాయింట్ కలెక్టర్ శివ కుమార్ నాయుడు వ్యవహార శైలిని తప్పుబట్టింది.  బుచ్చయ్యపై పగ తీర్చుకునేందుకే శివకుమార్ నాయుడు అతడ్ని అక్రమంగా జైలుకు పంపించారనే వాదనతో హైకోర్టు ఏకీభవిస్తోందని, జాయింట్ కలెక్టర్ శివకుమార్ నాయుడిని దోషిగా పేర్కొంటూ అతడికి 30 రోజుల జైలు శిక్షతోపాటు రూ. 2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు జడ్జి జస్టిస్ పి.నవీన్ కుమార్ శుక్రవారం సంచలన తీర్పునిచ్చారు.

- Advertisement -