హైదరాబాద్: 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత జానారెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గతంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ ఉండడంతో ఏటా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డేల నాడు హైదరాబాద్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఇటు తెలంగాణ, అటు ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు.
అయితే ఏపీకి ప్రస్తుతం కొత్త గవర్నర్ నియామకం కావడంతో ఈసారి ఏపీలోనూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు హాజరయ్యారు.