హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకోగా, తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగడి సునీతకు కరోనా సోకినట్టు తేలింది.
గత కొన్ని రోజులుగా ఆమె జలుబుతో బాధపడుతుండగా గురువారం హైదరాబాద్లో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం వచ్చిన ఫలితాల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
సునీత వద్ద పనిచేసే ఇద్దరు సిబ్బందికి కూడా కరోనా సోకినట్టు తేలింది. దీంతో సునీత భర్త, టెస్కాబ్ వైస్ చైర్మన్ అయిన గొంగడి మహేందర్రెడ్డితోపాటు మరికొందరికి పరీక్షలు నిర్వహించారు. నేడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.