ముజఫరాబాద్: పాకిస్థాన్లోని ప్రముఖ వార్తాపత్రిక ‘డాన్’ భారత పైలట్ అభినందన్ వర్థమాన్కు సంబంధించి ఓ వార్తను ప్రచురించింది. అభినందన్ను అదుపులోకి తీసుకునే ముందు జరిగిన పరిణామాలు ఇవేనని చెప్పుకొచ్చింది. ‘డాన్’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్ఓసీకి సరిగ్గా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి సమీపంలో బుధవారం ఉదయం 8:45 నిమిషాల సమయంలో రెండు ఎయిర్క్రాఫ్ట్లు మంటల్లో కాలిపోవడం తాను చూశానని 58 ఏళ్ల వయసున్న మహ్మద్ రజాక్ తెలిపినట్లు ‘డాన్’ పత్రిక రిపోర్ట్ చేసింది.
కాలిపోతున్న ఓ విమానం నుంచి పారాచ్యూట్లో ఓ వ్యక్తి తన ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కిందకు దిగడం తాను చూశానని చెప్పుకొచ్చారు. గ్రామంలోని కొందరు యువకులను వెంట తీసుకెళ్లి అక్కడికి వెళ్లి చూడగా ఓ పైలట్ కనిపించినట్లు మహ్మద్ రజాక్ తెలిపాడు. యువకులను అతని దగ్గరకు వెళ్లవద్దని, సైన్యం వచ్చే దాకా వేచి చూద్దామని తాను చెప్పినట్లు మహ్మద్ రజాక్ తమ పత్రికకు ఫోన్లైన్లో తెలిపినట్లు ‘డాన్’ పత్రిక చెప్పుకొచ్చింది. తాను వెళ్లిన సమయంలో కొన్ని డాక్యుమెంట్లను, మ్యాప్లను మింగేందుకు ఆ పైలట్ ప్రయత్నించాడని రజాక్ చెప్పినట్లు తెలిసింది.
ఇండియా జిందాబాద్…
పిస్టల్ చేతబుచ్చుకున్న ఆ పైలట్ ‘ఇది ఇండియానా లేక పాకిస్థానా’ అని స్థానిక యువకులను అడిగినట్లు రజాక్ చెప్పాడు. ఆ యువకుల్లో ఓ యువకుడు తెలివిగా వ్యవహరించి ‘ఇది ఇండియా’ అని అబద్ధం చెప్పాడని రజాక్ చెప్పినట్లు ‘డాన్’ పత్రిక చెప్పుకొచ్చింది. దీంతో పైలట్ అభినందన్ ‘ఇండియా జిందాబాద్’ అని నినాదాలు చేశారట.
దాహంగా ఉందని, నీళ్లు ఇవ్వాలని అభినందన్ కోరినట్లు తెలిసింది. అభినందన్ ఇండియాకు చెందిన వ్యక్తి అని తెలుసుకున్న కొందరు యువకులు ‘పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్’ అని నినాదాలు చేశారట. దీంతో.. వారు తనపై ఎక్కడ దాడి చేస్తారో అని అభినందన్ తన వద్దనున్న పిస్టల్తో గాల్లోకి కాల్పులు జరిపినట్లు ‘డాన్’ పత్రిక చెబుతోంది. ఈ పరిణామంతో కంగుతిన్న యువకులు అభినందన్పై విసిరేందుకు రాళ్లు చేతిలోకి తీసుకున్నారట.
దీంతో.. వారినుంచి తప్పించుకునే క్రమంలో అభినందన్ దాదాపు అర కిలోమీటరు వెనక్కి పరిగెత్తాడని, తనను వెంబడించిన యువకులకు పిస్టల్ చూపించి భయపెట్టాడని రజాక్ తమకు చెప్పినట్లు ‘డాన్’ పత్రిక వెల్లడించింది. ఈ పెనుగులాటలో అభినందన్ మరోసారి గాల్లోకి కాల్పులు జరిపాడట. జేబులో నుంచి కొన్ని డాక్యుమెంట్లను తీసి నీటిలో ముంచి నాశనం చేసే ప్రయత్నం కూడా చేశాడట.
అంతేకాదు, చేతిలోని పిస్టల్ కింద పడేయాలని ఆ యువకులు హెచ్చరికలు చేయగా.. అభినందన్ ఓ యువకుడిని కాలిపై కాల్చాడని కూడా ‘డాన్’ పత్రిక చెప్పుకొచ్చింది. అయితే.. ఇందులో నిజమెంత అనే విషయంలో స్పష్టత లేదు. ఎట్టకేలకు పిస్టల్ కింద పడేసిన పైలట్ అభినందన్ను పాక్ యువకులు చుట్టుముట్టారని.. వారు కోపంతో అతనిపై దాడి కూడా చేశారని.. ఈలోగా పాక్ సైన్యం వచ్చి అభినందన్ను కాపాడిందని ‘డాన్’ పత్రిక తన కథనంలో పేర్కొంది.
సంబంధిత వార్తలు
- భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం
- విరుచుకుపడ్డ భారత వాయుసేన.. జైషే మహ్మద్ ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్ ధ్వంసం! ఎక్స్ క్లూజివ్ వీడియో…
- పుల్వామా ఘటనపై ప్రతీకారం తీర్చుకున్న భారత్! వైమానిక దాడిని ధ్రువీకరించిన పాకిస్తాన్…
- ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్! భారత వాయుసేనకు ప్రశంసల వెల్లువ…
- పాక్ పై దాడికి కారణాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే!
- వైమానిక దాడులు: మోదీ అత్యవసర కేబినెట్ సమావేశం
- సర్జికల్ స్ట్రయిక్స్ 2.0: సత్తా చాటిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్! కార్గిల్ యుద్ధంలోనూ జైత్రయాత్ర…
- శత్రువు ముందు తలొగ్గి ఉంటె బలహీనులమని కాదు! వైరల్ అవుతున్న ఆర్మీ ట్విట్!
- ‘సురక్షితమైన చేతుల్లోనే భారత్’: ఐఏఎఫ్ మెరుపుదాడిపై ప్రధాని మోడీ ఏమన్నారంటే…
- ప్రతిదాడికి సిద్ధమై.. వెనక్కి తగ్గిన పాక్ ఎయిర్ ఫోర్స్! సాయం కోసం చైనాకు ఫోన్, కానీ…
- లోపల గుబులు, పైకి గాంభీర్యం.. ఆదినుంచీ పాక్ ఎత్తుగడే ఇదే: భారత్ వైమానిక దాడిపై పాక్ ఇలా…
- దేనికైనా సిద్ధంగా ఉండండి: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, తమ భూభాగంలో భారత వైమానిక దాడిపై సీరియస్…
- పుల్వామాలో ఉగ్ర దాడి తర్వాతి రోజే మెరుపు దాడులకు గ్రీన్ సిగ్నల్!: అంతా సీక్రెట్గానే..
- రాత్రంతా జాగారం: మోడీ పూర్తి పర్యవేక్షణలోనే సర్జికల్ స్ట్రైక్స్ 2.0
- పాక్పై వైమానిక దాడిలో హైదరాబాదీ పైలట్! మిరాజ్ పైలట్లకు సిటీలోనే శిక్షణ?
- సర్జికల్ స్ట్రయిక్స్-2 కోసం భారత్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- షాకింగ్: కశ్మీర్లో కుప్పకూలిన భారత యుద్ధ విమానం! పాకిస్తాన్ కూల్చేసిందా?
- ఇదే అంతిమ యుద్ధం కావొచ్చు! పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
- మా అదుపులోనే ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు: పాక్, వీడియో రిలీజ్, ఒక పైలట్ అదృశ్యమంటూ భారత్
- ప్రసంగం మధ్యలో వెళ్లిపోయిన మోదీ! కారణం ఇదేనా!
- భారత పైలట్పై పాక్ అమానుషం! అభినందన్ స్వస్థలం కేరళ!
- అమెరికా బిన్లాడెన్ను చంపినట్లే మేమూ చేయగలం: జైట్లీ
- ఒక్కసారి యుద్ధం మొదలైతే మన చేతుల్లో ఉండదు: చర్చలకు సిద్ధమంటూ ఇమ్రాన్
- మసూద్ అజార్పై నిషేధం విధించాల్సిందే: భారత్కు మద్దతుగా అగ్రదేశాలు
జై జై వీర జవాన్.. జై జై భారత్.. జై జై ప్రధాన మంత్రి