డివిలియర్స్‌ పోరాటం వృథా…ముంబైదే విజయం

Mumbai's victory News, de Villiers Latest News, Cricket latest news, Newsxpressonline
- Advertisement -

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.

188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లు ఆడి 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లలో పటేల్ 31, అలీ 13, కోహ్లీ 46, డెవీలియర్స్ 70, హెట్‌మెయిర్ 5 పరుగులు చేశారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ముంబై జట్టులో డికాక్(23), రోహిత్ శర్మ 48, యువరాజ్(23), సూర్యకుమార్ యాదవ్(38) హార్థిక్ పాండ్యా(32) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో చాహల్ 4, ఉమేశ్, సిరాజ్ తలో రెండు వికెట్లు తీశారు.

- Advertisement -