అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మంత్రుల జాబితాలో నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా పేరు లేదు. సామాజిక సమీకరణలతో రోజాకు ఈ సారి మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడం లేదని రాజకీయాల వర్గాల్లో వినిపిస్తుంది. తాజాగా ఎమ్మెల్యే రోజాకు, ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి నుంచి కాల్ వచ్చినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాదు శనివారం వెలగపూడిలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి రోజా అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చినట్టు సమాచారం. దీంతో వై.యస్.జగన్ మంత్రి వర్గంలో రోజాకు బెర్త్ అవకాశాలు సజీవంగా ఉన్నట్టు చర్చ నడుస్తోంది.
గత చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో రోజా సఫలమయ్యారు. దీంతో అప్పటి ప్రభుత్వం రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ రకంగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసింది రోజా. దీనితోనే చివరినిముషంలో అయినా కూడా రోజాకి తన క్యాబినెట్ లో చోటు ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు..