ఫ్యాన్స్ లేకుండా అంత ఎనర్జీతో క్రికెట్ ఆడలేమన్న సచిన్

ముంబై: కరోనా కారణంగా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచులు నిర్వహించాలంటూ వచ్చిన ప్రతిపాదనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెదవి విప్పాడు.

ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ ఆడటం చాలా కష్టంగా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. అభిమానులు లేకుండా అంత ఎనర్జీతో ఆడలేమని తేల్చేశాడు.

‘స్పీకర్లు పెట్టి సౌండ్ వినిపించాలని కొందరు సలహా ఇవ్వడం విన్నా. కానీ అలా చేసి ఉపయోగం లేదు. స్టాండ్స్‌లో అభిమానులను చూస్తే మనకు స్ఫూర్తి కలుగుతుంది. దాన్నుంచి చాలా శక్తి వస్తుంది. అభిమానుల నుంచే ఆ ఎనర్జీ పొందుతాం’ అని సచిన్ వెల్లడించాడు.

- Advertisement -