హైదరాబాద్: బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి మాధవీలతపై రాచకొండ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
మాధవీలత తన ఫేస్బుక్ ఖాతాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టు పెట్టారన్న ఫిర్యాదుతో ఆమెపై సెక్షన్ 295-ఎ కింద కేసు నమోదు చేశారు.
హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి చేసిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని గోపీకృష్ణ తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.